సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించగా, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ప్రసాదం పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు