Monday, April 13, 2026
More
    HomeUncategorizedకాళేశ్వరంలో పురాతన విగ్రహాల పరిరక్షణకు అడుగులు ₹120 కోట్లతో మ్యూజియం పనులు షురూ

    కాళేశ్వరంలో పురాతన విగ్రహాల పరిరక్షణకు అడుగులు ₹120 కోట్లతో మ్యూజియం పనులు షురూ

    జయశంకర్ భూపాలపల్లి (భారతవాసి న్యూస్): చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడంలో భాగంగా, మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న పురాతన విగ్రహాల పరిరక్షణకు అధికారులు నడుం బిగించారు. పురావస్తు శాఖ మరియు దేవాదాయ శాఖ సంయుక్తంగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

    క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ
    బుధవారం నాడు పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి, డిప్యూటీ సూపరింటెండెంట్ కోటయ్యలు, మరియు దేవస్థానం ఈవో మహేష్‌ కలిసి ఆలయ పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు:

    ఆవరణలోని పురాతన నృసింహస్వామి, సోమేశ్వరాలయం, చంద్రశేఖరాలయాల్లోని విగ్రహాలను పరిశీలించారు.

    వివిధ ప్రాంతాల్లో నిరాదరణకు గురైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన విగ్రహాలను గుర్తించారు.

    రసాయన శుద్ధి.. ప్రత్యేక భద్రత
    గుర్తించిన విగ్రహాలకు నిబంధనల మేరకు రసాయన పదార్థాలతో (Chemical Treatment) శుద్ధి చేసి, వాటికి తిరిగి పూర్వ వైభవం (మెరుగులు) దిద్దనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు మరియు పర్యాటకుల సందర్శనార్థం ఈ విగ్రహాలను దేవాలయ ఆవరణలోనే ప్రత్యేకంగా భద్రపరచనున్నారు.

    Spread the love
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments