🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 03 Sep, 2026 | Page: 1

టీఎంయూ నర్సంపేట డిపో అధ్యక్షుడిగా వేముల రవి గౌడ్ నియామకం

నర్సంపేట: తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నర్సంపేట డిపో అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమ నేత వేముల రవి గౌడ్ నియమితులయ్యారు. అశ్వద్ధామ రెడ్డి గారి నాయకత్వంలో, కార్మికుల పూర్తి అభిప్రాయాలు, మద్దతు మేరకు ఆయనను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నిరంతరం కార్మిక పక్షపాతిగా ఉంటూ వారి సమస్యలపై పోరాడే రవి గౌడ్ నియామకం పట్ల డిపో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంపై డిపో సిబ్బంది మరియు యూనియన్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
🏠 Home